News

11 భారతదేశంలోని రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు

భారత ఆర్థిక వ్యవస్థలో  వ్యవసాయం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మొత్తం భారతీయ జనాభాలో దాదాపు 60% మంది వ్యవసాయంలో నిమగ్నమై ఉన్నారు, దేశ స్తూల దేశీయోత్పత్తి లో 18% వాటా వ్యవసాయం నుండి వస్తుంది . రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు . ఇవి ప్రత్యక్షంగా  కానీ లేదా పరోక్షంగా గాని రైతు జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. వ్యవసాయనికి కావాల్సిన పని ముట్లు సేకరణ నుండి క్రయవిక్రయాలు వరకు మరియు పంట అనంతర కార్యకలాపాల వరకు రైతులు చాలా సవాళ్లను ఎదుర్కొంటున్నారు. కానీ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తరచుగా పట్టించుకోవడం లేదు. భారతదేశంలో రైతులు ఎదుర్కొంటున్న కొన్ని ప్రధాన సమస్యలు ఇలా ఉన్నాయి.

1. తక్కువ మరియు ఛిన్నాభిన్నమైన భూములు కలిగి ఉండటం

భారతీయ వ్యవసాయం ప్రధానంగా తక్కువ భూములు మరియు ఛిన్నాభిన్నమైన భూములు ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల రైతులు సమర్థులుగా మారుతున్నారు. 2015-16లో 10వ వ్యవసాయ లెక్కల ప్రకారం, భారతదేశం యొక్క మొత్తం భూమి 146.45 మిలియన్ హెక్టార్లు ఉండగా, 157.82 మిలియన్ హెక్టార్లు సాగు చేయడం జరుగుతుంది.  మొత్తం సాగు చేస్తున్న భూమిలో 86.2% చిన్న మరియు సన్న కార రైతులు సాగు చేస్తున్నారు (0 – 2 హెక్టార్లు). ఇలా భూమి ఛిన్నాభిన్నం కావడం వల్ల రైతులకు సరిపడా ఆదాయం రావడం లేదు. యాంత్రీకరణలో ఇబ్బందులు,ఒకే పంట పండించడం మరియు ఉత్పత్తుల వంటి సాధారణ వ్యవసాయ పద్ధతులను వాడటం వల్ల భూమి నాణ్యత కూడా క్షీణిస్తుంది. ఇది అధిక ఉత్పత్తి ఖర్చులు మరియు తక్కువ ఉత్పాదకతకు దారితీస్తుంది. ఈ సమస్యకు మూలకారణం వారసత్వ చట్టం కారణంగా ప్రారంభమైంది.

ఉత్తమ వ్యవసాయ ఉత్పత్తులను కొనండి

1. విత్తనాలు

2. పంట రక్షణ/పురుగుమందులు/తెగుళ్ళమందులు/బయో-ఆర్గానిక్

3. పంట పోషణ/ ఎరువులు

4. వ్యవసాయ యంత్రాలు/పరికరాలు/టూల్స్

2. మార్కెటింగ్ మరియు నిల్వ సౌకర్యాల కొరత

రవాణా ఖర్చులు, సరిలేని మార్కెట్ మౌలిక సదుపాయాలు, ధరల హెచ్చుతగ్గులు, సరైన మార్కెట్ సమాచారం లేకపోవడం మరియు స్థానిక వ్యాపారులు మరియు మధ్యవర్తులను దోపిడీ వంటి కారణాల వలన వ్యవసాయ  క్రయవిక్రయాలలో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు. గ్రామీణ ప్రాంతాల్లో నిల్వ సౌకర్యాలు లేకపోవడం పంట తర్వాత నష్టాలకు  కారణంగా ఉంది. దాదాపుగా 16% పండ్లు మరియు కూరగాయలు, 10% నూనెగింజలు, 9% పప్పులు మరియు 6% ధాన్యాలు నిల్వ సౌకర్యాల లేకపోవడం కారణంగా ప్రతి సంవత్సరం వృధా అవుతున్నాయి. వ్యవసాయోత్పత్తులు చాలా వరకు త్వరగా పాడైపోవడం జరుగుతుంది కాబట్టి  పంటలు పండిన వెంటనే తక్కువ ధరలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీనివల్ల వారికి తక్కువ ఆదాయం వస్తుంది. సరిపడా నిల్వ సౌకర్యాలు లేకపోవడం వల్ల సీజన్‌లో ప్రజల డిమాండ్‌ను తీర్చడం రైతులకు కష్టతరంగా మారుతుంది .

3. యాంత్రీకరణను తక్కువగా వాడడం

భారతదేశంలో యాంత్రీకరణతో సంబంధం లేకుండా చాలా వరకు వ్యవసాయ పనులు ఇప్పటికీ కూలీల ద్వారానే జరుగుతున్నాయి. భారతదేశంలో యాంత్రీకరణ యొక్క అత్యధిక స్థాయి 60 – 70% దున్నడం, కోయడం, నూర్పిడి చేయడం మరియు నీటిపారుదలలో మాత్రమే చూడవచ్చు . విత్తనాలు నాటడం , కలుపు తీయుడం మరియు ఇతర వ్యవసాయ పనులకు యంత్రాలను కనుగొన్నప్పటికీ  కొంతమంది రైతులు మాత్రమే వాటిని పంట ఉత్పత్తికి ఉపయోగిస్తున్నారు.

చిన్నపాటి భూముల  కలిగి ఉండడం వల్ల చిన్న రైతులు యాంత్రీకరణకు  ఇబ్బంది పడుతున్నారు. గ్రామీణ రైతులలో సరైన అవగాహన లేకపోవడం మరియు రాజధాని పరిమితులు ఈ సమస్యను సృష్టిస్తున్నాయి.

4. రుణ లభ్యత

వ్యవసాయ రంగంలో, ఆర్థిక సంస్థలు నుండి సకాలంలో, తగినంత మరియు తక్కువ-ధరకు రుణాల లభ్యత మరియు ఉపయోగించుకోవడం ముఖ్యంగా సన్నకారు మరియు చిన్న రైతులకు చాలా ముఖ్యమైనది.

అన్ని ఇతర పెట్టుబడులతో పాటు, వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి మూలధనం అత్యంత కీలకమైన పెట్టుబడులలో  ఒకటి. వ్యవసాయ ఉత్పాదకతపై ప్రభావం చూపే అంశాల్లో రుణ సదుపాయం ఒకటి. మూలధన లేక ఎదుర్కొంటున్న రైతులు అటువంటి పరిమితులు లేని ఇతరులతో పోలిస్తే వారి  మెరుగైన సాంకేతికతలు, యంత్రాలు మరియు పరికరాలలో పెట్టుబడి పెట్టకుండా తక్కువ పెట్టుబడులను ఉపయోగిస్తారు. ఇది ఉత్పాదకతను మాత్రమే కాకుండా ఉత్పత్తిలో నాణ్యతను కూడా ప్రభావితం చేస్తుంది. మెరుగైన రుణ సదుపాయాలను కల్పించడం వలన పెట్టుబడుల యొక్క సరైన వినియోగాన్ని సులభతరం చేస్తుంది మరియు పంట ఉత్పాదకతపై ప్రధాన ప్రభావాన్ని చూపుతుంది.

రుణ లభ్యత వ్యవసాయ ఉత్పత్తులకు మరియు వినియోగ అవసరాలకు వారి నగదు అవసరాలను తీర్చడానికి రైతులకు ఉపయోగపడుతుంది. ప్రభుత్వాలు వ్యవసాయ రుణ విధానాలను మెరుగుపరుస్తున్నప్పటికీ, రుణ పంపిణీలో ప్రాంతీయ ఎచ్చు తగ్గులు ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉంది.

5. సరైన నీటిపారుదల సౌకర్యాలు లేకపోవడం

భారతదేశంలో 80% నీటి వినియోగం వ్యవసాయంలో నీటిపారుదల కొరకు ఉపయోగిస్తున్నారు.

వ్యవసాయంపై ప్రభావం చూపే ప్రధాన అంశంలో భూగర్భ జలాల తగ్గిపోవడం . మంచి నీటిపారుదల వ్యవస్థ రైతులకు సకాలంలో వ్యవసాయ పనులు నిర్వహించడానికి సహాయపడుతుంది. నీటిపారుదలలో 65% మితిమీరిన భూగర్భజల వనరులను ఉపయోగిస్తున్నందున  కారణంగా ఇటీవలి కాలంలో భూగర్భ జలాల పట్టికలో తగ్గుదలను గమనించవచ్చు. భారతదేశంలో నీటిపారుదల సౌకర్యాలు తక్కువ మరియు ఎక్కువ మంది రైతులు ఇప్పటికీ వర్షాలపైనే ఆధారపడి ఉన్నారు. మన దేశంలో వర్షదారం క్రింద 51% నికర భూమిలో  వ్యవసాయం చేస్తుండగా 40% ఉత్పత్తి ఇందులో నుండి వస్తుంది

నీటిపారుదల ఉన్న ప్రాంతాల్లో, రైతులు ప్రధానంగా  పారుదల పద్ధతిని పాటిస్తున్నారు . ఈ రోజుల్లో సూక్ష్మ నీటి పారుదల వ్యవస్థలు ప్రాముఖ్యత సంతరించుకున్నప్పటికీ వాటిని ఉపయోగిస్తున్న వారిలో ఎక్కువ మంది పెద్ద రైతులు పేద రైతులు వాటిని భరించలేని పరిస్థితి. 2021 సంవత్సరంలో సాగు చేసిన మొత్తం విస్తీర్ణంలో, నికర నీటిపారుదల ప్రాంతం 68.38 మిలియన్ హెక్టార్లు గా ఉంది . ఇందులో సూక్ష్మ నీటిపారుదల విస్తీర్ణం 12.90 మిలియన్ హెక్టార్లు మాత్రమే ఉంది, ఇది నికర నీటిపారుదల విస్తీర్ణంలో 18.8% మాత్రమే.

6. భూసారం తగ్గిపోవడం

1960లో హరిత విప్లవం తర్వాత రసాయన ఎరువుల వాడడం పెరిగింది. త్వరగా ఫలితాలు పొందేందుకు రైతులు ఎరువులను విపరీతంగా ఉపయోగించడం ప్రారంభించారు. రసాయనిక ఎరువులు అధికంగా వాడటం వలన సేంద్రీయ పదార్థం మరియు క్రుళ్ళిపోయిన స్థావరపు గుజ్జు తగ్గడం , ప్రయోజనకరమైన కీటకాల సంఖ్య తగ్గిపోవడం , పేలవమైన ఎదుగుదల, చీడపీడల దాడి పెరగడం, నేల ఉదజని సూచిక మారడం మరియు చివరికి తక్కువ  ఉత్పత్తులకు కారణమైతుంది. యూరియా యొక్క ఎక్కువ వినియోగం కాలక్రమేణా నేల  యొక్క భూసారం తగ్గిపోవడానికి కారణం అవుతుంది . 2022-23 సంవత్సరంలో యూరియా మొత్తం ఎరువుల ఉత్పత్తిలో సగానికి పైగా (58.4%) మరియు మొత్తం వినియోగం (57.9%) మరియు దిగుమతిలో 35.9% గా ఉంది . నేల క్షీణతకు ఇతర కారణాలు సరైన పంట విధానం లేకపోవడం మరియు నిరంతర సాగుచేయడం . భారతదేశంలో, 2015-16 సంవత్సరంలో మోనోక్రాపింగ్ విధానంలో మొత్తం విస్తీర్ణం లో సుమారుగా 52.8 మిలియన్ హెక్టార్లు, ఇది మొత్తం సాగు విస్తీర్ణంలో 47% గా ఉంది .

7. పంటలకు బీమా పథకాలకు సరిపడా అందుబాటులో లేకపోవడం

రైతులకు బీమా పథకాలపై సరైన అవగాహన లేకపోవడం, పంట నష్టాల కారణంగా జరిగిన నష్టాల పరిహారం గురించి తెలియకపోవడం , పంట బీమా పథకాలకు సరిపడా సమాచారం లేకపోవడం మరియు బీమాలు చెల్లించకపోవడం/ తగిన సమయం లో పరిష్కారం కాకపోవడం

8. వాతావరణ మార్పు వల్ల ప్రభావం

కరువులు, వరదలు మరియు తుఫానుల వంటి విపరీత వాతావరణ సంఘటనలు తరచుగా వాటి తీవ్రత పెరగడం వంటి వాతావరణ మార్పుల వలన  వాతావరణ మార్పులుకు దారితీయవచ్చును . ఈ మార్పులు నేల  సారాన్ని , పంట దిగుబడిని మరియు పశువుల ఉత్పత్తిని తగ్గిస్తాయి , ఇది రైతులకు ఉత్పత్తిని మరియు ఆదాయాన్ని తగ్గిస్తుంది. రైతులు తెగుళ్లు మరియు వ్యాధుల నిర్వహణ పద్ధతుల్లో ఎక్కువ పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది ఇది వారి ఖర్చులను పెంచుతుంది మరియు వారి లాభాలను తగ్గిస్తుంది. వేడి గాలులు పంటలలో ఒత్తిడిని కలిగిస్తాయి  ఇది ముఖ్యంగా పరాగసంపర్కం, మొగ్గ దశ లేదా పండు ఏర్పాడడం సమయంలో సంభవించినప్పుడు దిగుబడిని తగ్గిస్తుంది . వాతావరణ మార్పు వలన కొన్ని ప్రాంతాలలో నీటి కొరతకు ప్రారంభామావుతుంది ఇది నీటిపారుదలని ప్రభావితం చేస్తుంది మరియు దిగుబడిని తగ్గిస్తుంది. రైతులు వర్షాధార వ్యవసాయంపై ఆధారపడవలసి వస్తుంది, ఇది వాతావరణ మార్పుల ప్రభావాలకు మరింత అనూహ్యమైనది మరియు హాని కలిగించునది .

అనూహ్య వర్షపాతం అనేక వ్యవసాయ పనులకు ఇబ్బంది కలిగిస్తుంది మరియు పంట సమయంలో ఊహించని వర్షపాతం మొత్తం పంట నష్టానికి దారి తీస్తుంది. వరదలకు దారితీసే భారీ వర్షాలు పంటలకు మరియు  నేలకు హానికరం. భారతదేశంలో, 2015-16 మరియు 2021-22 మధ్య భారీ వర్షాలు మరియు వరదలతో సహా జల-వాతావరణ వైపరీత్యాల కారణంగా దాదాపు 33.9 మిలియన్ హెక్టార్ల పంటలు వాతావరణ మార్పు వల్ల దెబ్బతిన్నాయి

9. ధరల ఎచ్చు తగ్గులు

ధరల ఎచ్చు తగ్గులు రైతుల జీవనోపాధిపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది, ముఖ్యంగా క్రయవిక్రయాలు హెచ్చుతగ్గులు  చిన్నకార రైతులుకు ఏక్కువ హాని కలిగిస్తున్నది . ధరల ఎచ్చు తగ్గులు రైతులకు నిలకడ లేని ఆదాయంగా ఉంటుంది  ఎందుకంటే ధరలు ఆకస్మికంగా పడిపోవడం వారి ఆదాయం మరియు లాభాలను తగ్గిస్తుంది. దీని వల్ల రైతులు వ్యవసాయం మరియు పెట్టుబడి పెట్టడం కష్టతరం అవుతుంది , ఈ పరిస్థితులలో రైతులు తమ ఉత్పత్తులకు లభించే ధరలపై ఖచ్చితమైన ధరలు తెలియక ఆందోళనలో పడడం జరుగుతుంది.

దీంతో రైతులు ఏ పంటలు పండించాలి, ఎంత ఉత్పత్తి చేయాలి, ఎప్పుడు విక్రయించాలి అనే విషయాలపై అవగాహనాపరమైన నిర్ణయాలు తీసుకోవడం కష్టంగా మారుతుంది.

10. పేలవమైన శిక్షణ మరియు విస్తరణ సౌకర్యాలు

వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని  చెప్పడం ద్వారా రైతులకు సహాయపడతాయి, సమస్యల పరిష్కారంలో రైతులకు సహాయపడతాయి మరియు గ్రామీణాభివృద్ధికి తోడ్పడుతుంది . కానీ భారతదేశంలో పొడిగింపు వ్యవస్థ సమానంగా సమతుల్యంగా లేదు. తగిన శిక్షణ మరియు విస్తరణ కార్యాక్రమాలు లేకుండా, రైతులకు పంట దిగుబడిని పెంచడానికి సహాయపడే తాజా వ్యవసాయ పద్ధతులు మరియు సాంకేతికతలపై అవగాహన ఉండకపోవచ్చు. దీనివల్ల దిగుబడి తగ్గుతుంది. దీని కారణంగా రైతుల ఆదాయం తగ్గుతుంది.

శిక్షణ మరియు విస్తరణ సేవలు లేకపోవడం వల్ల రైతులు పంటలు తెగుళ్లు మరియు వ్యాధుల బారిన పడుతాయి అది దిగుబడి పై ప్రభావం చూపుతుంది . ఈ ప్రమాదాలను ఎలా నివారించాలి లేదా తగ్గించాలి అనే సమాచారంపై అవగాహనా లేకుంటే నష్టాలు సంభవిస్తాయి. శిక్షణ లేకపోవడం వల్ల రైతులకు ఇటీవలి పథకాలు, ఆర్థిక సహాయం మరియు పెట్టుబడి పెట్టడానికి మరియు వారి దిగుబడిని పెంచడానికి ఆర్థిక వనరులను ఎలా పొందాలో తెలియకపోవచ్చు

11. ప్రభుత్వం ఆర్ అండ్ డి పై తక్కువ ఖర్చు చేయడం

పరిశోధన మరియు అభివృద్ధి పై ప్రభుత్వం చేసే తక్కువ ఖర్చు వ్యవసాయంలో రైతులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది,  ఉత్పాదకత తగ్గడం, పెరిగిన ఖర్చులు మరియు తగ్గుతున్న లాభాలు . ఆర్ అండ్ డి పై ప్రభుత్వ వ్యయం తక్కువగా ఉంటే  రైతులకు కొత్త సాంకేతికతలు మరియు పద్ధతులు అందుబాటులో ఉండకపోవచ్చు, మెరుగైన పంట రకాలు మార్కెట్‌లో రాకపోవచ్చు మరియు పోటీతత్వాన్ని తగ్గడం జరుగుతుంది. ప్రభుత్వం ఆర్ అండ్ డి లో తక్కువ పెట్టుబడి పెట్టడం వల్ల రైతులు తమ సొంత వనరులను మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా  పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. దీనివల్ల ఉత్పత్తి ఖర్చులు పెరగవచ్చు,  మార్కెట్‌లో రైతులు పోటీపడటం కష్టమవుతుంది.

ముగింపు

భారతీయ రైతు సంఘం ప్రధానంగా వ్యవసాయంలో పైన పేర్కొన్న అన్ని సవాళ్లను ఎదుర్కొనే చిన్న మరియు సన్నకారు రైతులను కలిగి ఉంది . వ్యవసాయంలో రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు ప్రకృతి వైపరీత్యాల నుండి మానవ పనుల వరకు వాతావరణ మార్పు, నేల కోత, జీవవైవిధ్య నష్టం, నీటి వనరులు తగ్గడం , డబ్బు కొరత, కూలీల కొరత మరియు ఇతర పెట్టుబడులు మొదలైనవి. ఈ సమస్యలకు ప్రధాన కారణం ప్రధానంగా సరైన అవగాహన లేకపోవడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తక్కువగా స్వీకరించడం, మూలధనం లేకపోవడం లేదా రైతులు మరియు ప్రభుత్వ సంస్థల మధ్య అంతరం. ఈ సమస్యలను పూర్తిగా పరిష్కరించలేము కానీ తెలివైన వ్యవసాయ పద్ధతులను అనుసరించడం , వనరులను స్థిరంగా ఉపయోగించడం మరియు గ్రామీణ రైతులు, ప్రభుత్వం మరియు ఆర్థిక సంస్థల మధ్య అంతరాన్ని  తగ్గించడం ద్వారా కొంత వరకు తగ్గించవచ్చు.

Recent Posts

సెల్జల్: ఆధునిక వ్యవసాయానికి నీటి పరిష్కరణలో విప్లవాత్మక మార్పు

వ్యవసాయంలో సామర్థ్యం మరియు ఉత్పత్తి శక్తి ఎల్లప్పుడూ ముఖ్యమైనవి. మీ నీటిని పరిస్థితిని మెరుగుచేయడమే చేయడమే కాకుండా, మీ మొక్కల…

January 29, 2025

Xscalent : డ్రిప్ క్లీనింగ్ మెకానిజం ద్వారా నిలబడి పంటలకు భద్రతాత్మక పరిష్కారాలు

ఆధునిక వ్యవసాయంలో సమర్ధవంతమైన నీటి నిర్వహణ అత్యంత అవసరం మరియు డ్రిప్ సేద్య విధానం మొక్కల వేర్లకు నేరుగా నీటిని…

January 29, 2025

బయోకులమ్ AW: పంటల స్థిరత్వానికి సిద్ధంగా ఉన్న కుళ్ళిప చేసే/ డెకంపోజర్

 స్థిరమైన వ్యవసాయంలో ఉన్నతమైన భావన దాగి ఉంది: వ్యర్థాలను సంపదగా మార్చడం. సేంద్రీయ వ్యవసాయ వ్యర్థాలు భారం కాకుండా, నేలను…

January 29, 2025

ఎపిసెల్: పంటల పూర్తి సామర్థ్యాన్ని విడుదల చేస్తూ స్థిరమైన వ్యవసాయం కోసం

నేటి మారుతున్న వ్యవసాయ ప్రకృతి దృశ్యం,  స్థిరమైన మరియు సమర్థవంతమైన వ్యవసాయ పద్ధతులను కనుగొనడం అత్యంత ముశ్యం. అక్కడ ఎపిసెల్…

January 29, 2025

సెల్జల్ తో వ్యవసాయ సామర్థ్యాన్ని పెంచడం: నీటి శుధ్ది మరియు pH సమతుల్యత కోసం చిట్కాలు

వ్యవసాయంలో నీరు ఒక ప్రాథమిక వనరు, నీరు పంట పెరుగుదల మరియు రక్షణకు అవసరమైన ముఖ్యమైన పోషకాలు మరియు రసాయనాలకు…

January 29, 2025

ఎక్స్‌స్కాలెంట్: బిందు సేద్యం / డ్రిప్ వ్యవస్థ శుభ్రపరచడానికి సురక్షితమైన మరియు ప్రభావవంతమైన పరిష్కారం

ఆధునిక వ్యవసాయంలో బిందు సేద్యం వ్యవస్థలు ఒక ముఖ్యమైన భాగంగా మారాయి, మొక్కల వేర్లకు నేరుగా నీటిని అందించే అత్యంత…

January 29, 2025