HomeNewsNational Agri Newsరైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ప్రభుత్వ ప్రయత్నాలు

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ప్రభుత్వ ప్రయత్నాలు

భారత ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి కృషి చేస్తోంది మరియు ఈ లక్ష్యాన్ని సాధించడానికి అనేక విధానాలు, సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు పథకాలను అమలు చేసింది. ఈ కథనంలో, మనం ఈ స్కీమ్‌లను నిశితంగా పరిశీలించాలి మరియు వాటి ముఖ్య లక్షణాలను అన్వేషిధము.

అవలోకనం-

రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో అత్యంత ముఖ్యమైనది లక్షణం బడ్జెట్ కేటాయింపుల్లో అపూర్వమైన పెంపు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు మత్స్య, పశుసంవర్ధక & పాడి పరిశ్రమలకు వారి బడ్జెట్‌లో కేవలం రూ. 30,223.88 కోట్లు, కానీ ఇప్పుడు 2023-24లో 4.35 రెట్లు ఎక్కువ పెరిగి రూ. 1,31,612.41 కోట్ల కు చేరింది.

ప్రభుత్వం పిఎం-కిసాన్ పథకాన్ని కూడా ప్రారంభించింది, ఇది మూడు విడతల్లో రైతులకు సంవత్సరానికి  రూ . 6,000 అందిస్తుంది. ఇప్పటివరకు 11 కోట్ల మందికి పైగా రైతులకు రూ. 2.24 లక్షల కోట్లు అందించింది. ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన (PMFBY), 2016లో ప్రారంభించబడింది. ఈ పథకం అధిక ప్రీమియం రేట్లు మరియు క్యాపింగ్ సమస్యలను పరిష్కరిస్తుంది. మరియు రైతులు రూ. 25,174 కోట్లు ప్రీమియంగా చెల్లించారు మరియు రూ. 1,30,185 కోట్ల రూపాయిలకు పైగా క్లెయిమ్‌లను పొందారు.  

వ్యవసాయ రంగానికి సంస్థాగత రుణాన్ని అందించడంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది, ఇది 2013 -14 లో రూ. 7.3 లక్షల కోట్లు లక్ష్యంగా 2022 – 23 లో రూ. 18.5 లక్షల కోట్లుగా కొనసాగుతుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్‌ల (KCC) ద్వారా పిఎం – కిసాన్ లబ్ధిదారులందరికీ రాయితీ సంస్థాగత క్రెడిట్‌ని అందించడానికి ఫిబ్రవరి 2020 నుండి ప్రత్యేక డ్రైవ్ చేపట్టబడింది మరియు 30.12.2022 నాటికి, డ్రైవ్‌లో భాగంగా, 389.33 లక్షల కొత్త కిసాన్ క్రెడిట్ కార్డులు (KCCs) రూ. 4,51,672 కోట్ల క్రెడిట్ పరిమితితో దరఖాస్తులు ఆమోదించబడ్డాయి. 

ఉత్పత్తి వ్యయం కంటే ఒకటిన్నర రెట్లు కనీస మద్దతు ధరని (ఎంఎస్‌పి) నిర్ణయించడం ప్రభుత్వం యొక్క మరో ప్రధాన చొరవ. 2018-19 నుండి, అన్ని ఖరీఫ్, రబీ మరియు ఇతర వాణిజ్య పంటల కనీస మద్దతు ధర (MSP) అఖిల భారత ఉత్పత్తి వ్యయంపై 50% రాబడిని అందించడానికి పెంచారు. 

సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, ప్రభుత్వం 2015-16లో పరంపరగత్ కృషి వికాస్‌యోజన (PKVY)ని ప్రారంభించింది, దీని విస్తీర్ణం 6.53 లక్షల హెక్టార్లు మరియు 16.19 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చింది. నమామి గంగే కార్యక్రమం 1.23 లక్షల హెక్టార్లలో మరియు సహజ వ్యవసాయం 4.09 లక్షల హెక్టార్లలో సాగైంది. ప్రభుత్వం 1,72,966 హెక్టార్ల విస్తీర్ణంలో నార్త్ ఈస్ట్ రీజియన్ లో మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్‌మెంట్‌ను (MOVCDNER) ప్రారంభించింది. 

2015-16లో ప్రారంభించబడిన పర్ డ్రాప్ మోర్ క్రాప్ (PDMC) పథకం నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడం, ఇన్‌పుట్ ఖర్చులను తగ్గించడం మరియు డ్రిప్ మరియు స్ప్రింక్లర్ సిస్టమ్‌ల వంటి సూక్ష్మ నీటిపారుదల సాంకేతికతల ద్వారా ఉత్పాదకతను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. 2015-16 సంవత్సరం నుంచి ఇప్పటివరకు పీడీఎంసీ పథకం ద్వారా 72 లక్షల హెక్టార్ల విస్తీర్ణం మైక్రో ఇరిగేషన్ కింద ఉంది. ప్రభుత్వం నాబార్డ్‌తో మైక్రో ఇరిగేషన్ ఫండ్‌ను ఏర్పాటు చేసింది, ప్రారంభంలో రూ. 5,000 కోట్లు. 2021-22 బడ్జెట్ ప్రకటనలో, ఫండ్ కార్పస్ పెంచబోతున్నట్లు పేర్కొనబడింది.

 సమాచార పట్టిక-

విధానం/కార్యక్రమం వివరణ అంకెలు
బడ్జెట్ కేటాయింపు వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు మత్స్య, పశుసంవర్ధక & పాడి పరిశ్రమల మంత్రిత్వ  శాఖకు బడ్జెట్ కేటాయింపులు పెంపు 2013-14 లో రూ. 30223.88 కోట్ల నుండి 2023-24లో రూ. 1,31,612.41 కోట్లకు పెంపు
పిఎం-కిసాన్ ఈ పథకం ద్వారా రూ.6000 ఆదాయ మద్దతుగా 3 సమాన వాయిదాలలో సంవత్సరానికి జమ చేయబడతాయి 11 కోట్ల మందికి పైగా రైతులకు రూ. 2. 24 లక్షల కోట్లు ఇప్పటి వరకు అందాయి 
ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన (PMFBY) పంటల బీమా పథకం 2016లో ప్రారంభించబడింది ఈ పధకానికి నమోదు చేసుకున్న 37.66 కోట్ల రైతులకు ప్రీమియం రూ. 25,174 కోట్ల అయినట్లయితే, అందులో నుండి 12.38 కోట్ల రైతుల నుండి వచ్చిన క్లెయిమ్ ధరకాస్తులకు గాను 1,30,185 కోట్లు చెల్లించబడ్డాయి.
సంస్థాగత క్రెడిట్ 2013-14 లో రూ  7.3 లక్షల కోట్ల నుంచి పెరిగి 2022-23లో రూ. 18.5 లక్షల కోట్లు లక్ష్యంగా ప్రారంభించబడింది 389.33 లక్షల కొత్త KCC అప్లికేషన్‌లు రూ. 4,51,672 కోట్లు క్రెడిట్ పరిమితితో ఆమోదించబడ్డాయి. 
కనీస మద్దతు ధర (MSP) MSP ఉత్పత్తి వ్యయం కంటే ఒకటిన్నర రెట్లు నిర్ణయించబడింది 2018-19 నుండి ఉత్పత్తి వ్యయంపై 50% రాబడిని నిర్ధారించడానికి అన్ని ఖరీఫ్, రబీ మరియు వాణిజ్య పంటలకు MSP పెంచబడింది
సేంద్రీయ వ్యవసాయం PKVY, నమామి గంగే కార్యక్రమం, సహజ వ్యవసాయం మరియు BPKP ద్వారా సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం PKVYలో 6.53 లక్షల హెక్టార్లలో 32,384 క్లస్టర్లు ఏర్పడ్డాయి. నమామి గంగే 1.23 లక్షల హెక్టార్లు, సహజ వ్యవసాయం 4.09 లక్షల హెక్టార్లు. 1.72 లక్షల హెక్టార్లలో MOVCDNER ప్రారంభించబడింది
పర్ డ్రాప్ మోర్ క్రాప్

(PDMC)

మైక్రో ఇరిగేషన్ టెక్నాలజీల ద్వారా నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ పథకం ప్రారంభించబడింది PDMC పథకం ద్వారా 72 లక్షల హెక్టార్ల విస్తీర్ణం మైక్రో ఇరిగేషన్ కింద ఉంది.
మైక్రో ఇరిగేషన్ ఫండ్ నాబార్డ్ రూ. 5,000 కోట్లు ప్రారంభ కార్పస్‌తో ఒక నిధిని సృష్టించింది ప్రాజెక్టులు రూ. 17.09 లక్షల హెక్టార్లకు 4,710.96 కోట్లు మంజూరయ్యాయి
రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPOలు) కొత్త సెంట్రల్ స్కీమ్ ద్వారా FPOల ప్రమోషన్ N/A

 

spot_img

Read More

Stay in Touch

Subscribe to receive latest updates from us.

Related Articles